రైతులకు త్వరలో డిజిటల్‌ ఐడీలు

ఆధార్‌ తరహాలో జారీ చేయనున్న కేంద్రం మూడేండ్లలో 11 కోట్ల మందికి మంజూరు

రైతులకు త్వరలో డిజిటల్‌ ఐడీలు

న్యూఢిల్లీ  : 


దేశంలోని 11 కోట్ల మంది రైతులకు ఆధార్‌ తరహాలో డిజిటల్‌ ఐడీలు జారీచేయాలని కేంద్రం నిర్ణయించింది.

రైతులను సాధికారులను చేసేందుకు వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాలలో ఈ కార్డులను జారీచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అగ్రిస్టాక్‌ కార్యక్రమంలో భాగంగా రైతులకు అందజేసే సేవలు, పథకాలను క్రమబద్ధం చేసేందుకు డిజిటల్‌ ఐడీలను ఇవ్వనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు కోట్ల మందికి, వచ్చే ఆర్థిక సంవత్సరం మూడు కోట్ల మందికి, ఆ తరువాత ఏడాది రెండు కోట్లమందికి డిజిటల్‌ ఐడీలను జారీచేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఐడీలను సృష్టించి, నిర్వహిస్తాయని పేర్కొంది. రైతుల భూమి రికార్డులు, వారి పశు సంపద, పంటల సాగు, వారికి లభించే సదుపాయాలకు ఐడీలను అనుసంధానం చేస్తారని వివరించింది. త్వరలో దేశవ్యాప్తంగా పంటల సర్వేను ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 400 జిల్లాల్లో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగిలిన జిల్లాల్లో డిజిటల్‌ సర్వే పూర్తిచేస్తామని పేర్కొంది.

Tags:

Related Posts

Advertisement

Latest News