ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం

ఆంధ్రప్రదేశ్ :


విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు 8వ రోజు కూడా విస్తృతంగా పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 8వ రోజు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కుమ్మరిపాలెం జంక్షన్, సితార సర్కిల్, చిట్టానగర్, మిల్క్ ప్రాజెక్ట్ మీదుగా జక్కంపూడి వెళ్లారు. ఆయా ప్రాంతాల్లో వరద సహాయక కార్యక్రమాలపై బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

అనంతరం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు వాగు పొంగడానికి అక్రమాలే కారణమన్నారు. తెలంగాణలో అమలులో ఉన్న ఆపరేషన్ హైడ్రా తరహాలో చట్టాన్ని తీసుకొచ్చి బుడమేరు అక్రమాలను తొలగిస్తామని హెచ్చరించారు. కొంతమంది ఆక్రమణల కారణంగా.. లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

Tags:

Related Posts

Advertisement

Latest News