కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన
On
విజయవాడ :
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లల వసూలుపై ఊరటనిచ్చే విషయం చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు బిల్లుల వసూలుని వాయిదా వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. వరదల్లో పాడైపోయిన వాటి మరమ్మత్తులకు రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలని అన్నారు. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు రేట్లు డిమాండ్ చేసి ప్రజలను దోచుకోకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాల రిపేర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు, గ్యాస్ స్టవ్ల రిపేర్లు.. ఇలా ఏ రిపేర్కు అయినా ఒక రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆన్లైన్లో ఇలాంటి సేవలు అందించేవారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Tags:
Related Posts
Latest News
HIVకి టీకా వచ్చేసింది..!!
22 Sep 2024 10:58:59
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80...