నేడు నూతన పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణస్వీకారం

నేడు నూతన పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణస్వీకారం

హైదరాబాద్ : 


తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఆదివారం మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టను న్నారు. ముందుగా ఆయన గన్ పార్కుకు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు.

అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 :30 గంటలకు గాంధీ భవన్ కు చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించను న్నారు .ఆ తరువాత ఇందిరాభవన్ ముందు బహిరంగ సభ నిర్వహించ నున్నారు.

ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు,కాంగ్రెస్ నాయకురాలు దీపాదాస్ మున్షి,మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని ప్రసంగించను న్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు. 


నూతన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు శుభాకాంక్షలు చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తం గా అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ, మండల, జిల్లా,నాయకులు, కార్య కర్తలు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ కు తరలిరానున్నట్లు తెలుస్తుంది.

Tags:

Related Posts

Advertisement

Latest News